బంగళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు రోజుల పాటూ ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలకు అవకాశం ఉందంటున్నారు. ఈ ప్రభావం చిత్తూరు, తిరుపతి జిల్లాలపై కూడా ఉంటుందంటున్నారు. ఈ మేరకు ఈ రెండు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తం అయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో భారీ వర్షాల కారణంగా అన్ని స్కూళ్లకు ఇవాళ (అక్టోబర్ 14న) సెలవు ప్రకటించారు. అలాగే చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
మరోవైపు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నాలుగు రోజుల పాటూ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామస్థాయి నుంచి జిల్లా అధికారుల వరకు అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు.. ఒకవేళ ఎవరైనా వెళ్లి ఉంటే వెనక్కు వచ్చేయాలని సూచించారు. అంతేకాదు తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తం ఉండాలని.. కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. ఏ సమయంలోనైనా 0877-2236007 నంబరుకు ఫోను చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.
అలాగే ముందస్తు జాగ్రత్తగా లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి.. పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలో సెలవుల్లో ఉన్న వారు వెంటనే విధుల్లో చేరాలని సూచించారు. అలాగే నాలుగు రోజులపాటు జలపాతాలు, బీచ్లకు పర్యాటకులకు అనుమతి ఉండదు. భారీ వర్షాల కారణంగా సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కారవేదికను రద్దు చేశారు. అలాగే పర్యాటక కేంద్రమైన తలకోనకు ఎవరూ రావొద్దని పోలీసులు కోరారు. నాలుగు రోజులపాటు పర్యాటకులకు అనుమతి నిలిపివేసినట్లు తెలిపారు. తలకోన జలపాతంతో పాటు మాకలరేవు, ధనువు తీసిన బండ ప్రాంతాలకు అనుమతి లేదు. ఇటు తిరుపతి జిల్లాలో కూడా అధికారులు అప్రమత్తం అయ్యారు.. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa