వైసీపీ పార్టీలో ఉండే నేతలకు జగన్మోహన్ రెడ్డిపై నమ్మకం సన్నగిల్లిందని విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఆరోపించారు. దీపం పథకం కానుకగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉచిత గ్యాస్ సిలిండర్లను మహిళా లబ్ధిదారులకు ఎమ్మెల్యే గణబాబు అందజేశారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అంటేనే సంక్షేమమని ఎమ్మెల్యే గణబాబు చెప్పారు.
కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సహకారం, జనసేన యువ నాయకుల సహకారంతో అన్ని కలబోసి ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని తెలిపారు. పేదలకు ఉపయోగపడే విధంగా సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని వివరించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కొనసాగాలంటే రాష్ట్రానికి ఆదాయం పెంచే మార్గాలను దృష్టి పెడుతూ నిరంతర శ్రామికుడిగా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉండే పరిస్థితులను చక్కబట్టలేని నాయకుడు రాష్ట్రాన్ని ఏవిధంగా ఈరోజు పరిపాలన చేశారో ప్రజలు తెలుసుకున్నారని చెప్పారు.జగన్ రెడ్డి స్వార్థపూరిత ఆలోచనలు ఈరోజు బయటపడ్డాయని ఎమ్మెల్యే గణబాబు విమర్శలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa