విశాఖ కేజీహెచ్లో మిరాకిల్ ఘటన చోటు చేసుకుంది. విగతజీవిగా జన్మించిన శిశువులో ఎనిమిది గంటల తర్వాత చలనం వచ్చింది. శుక్రవారం (నవంబర్ 9) రాత్రి 9 గంటలకి చలనం లేకుండా శిశువు జన్మించగా.. డాక్టర్లు రాత్రంతా రాత్రంతా శ్రమించారు. అయినా శిశువులో ఎటువంటి చలనం కనిపించలేదు. దీంతో శిశువు మృతిచెందినట్లు హాస్పిటల్ సిబ్బంది రికార్డ్స్లో ఎంట్రీ చేశారు.
అనంతరం శిశువును సిబ్బంది తండ్రికి అప్పగించారు. శిశువును అంబులెన్స్లోకి ఎక్కిస్తున్న సమయంలో తండ్రి చేతుల్లోని శిశువులో కదలిక గమనించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. శిశువుకి వైద్యం చేశారు. శిశువు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు ప్రకించారు. దీంతో ఆ తండ్రి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చనిపోయాడని భావించిన శిశువు బతికే ఉండటంతో ఆనందంతో కంటతడి పెట్టుకున్నాడు.
హాస్పిటల్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నంలోని ఒక కాలనీకి చెందిన గర్భిణీ పురిటి నొప్పులతో గతరాత్రి కేజీహెచ్ గైనకాలజీ వార్డులో చేరారు. డాక్టర్లు సిజేరియన్ చేసి గర్బిణీకి ప్రసవం చేశారు. మగబిడ్డ జన్మించినప్పటికీ బరువు తక్కువగా ఉంది. శిశువులో ఎటువంటి చలనం లేదు. దీంతో అవసరమైన వైద్య సేవలను డాక్టర్లు అందించారు. శనివారం తెల్లవారుజాము వరకు ప్రయత్నించినా ఉపయోగం లేదు. దానికి తోడు శిశువు ఊపిరి ఆగిపోయింది. విధుల్లో ఉన్న డాక్టర్లు శిశువును పరిశీలించి.. చనిపోయినట్లు నిర్ధారించారు. హాస్పిటల్ రికార్డుల్లోనూ శిశువు మృతి చెందినట్లు నమోదు చేశారు.
అనంతరం శిశువును కుటుంబ సభ్యులకు అందించగా.. తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. శిశువును ఇంటికి తీసుకెళ్లి ఖననం చేసేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేసుకున్నారు. అంబులెన్స్లో ఎక్కే సమయంలో తండ్రి చేతుల్లోని శిశవులో కదలికలను కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే డాక్టర్ల వద్దకు తీసుకెళ్లగా.. శిశువును ఎన్ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం శిశువుకు ప్రాణప్రాయం లేదని చెప్పారు. దీంతో ఆ తండ్రి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
కాగా, డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బంధువులు ఆరోపించారు. దీనిపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద వివరణ ఇచ్చారు. ఇటువంటి కేసులు చాలా అరుదని చెప్పారు. శిశువును గైనకాలజిస్టులు, చిన్న పిల్లల డాక్టర్లు కలిసి చూస్తున్నారని తెలిపారు. తక్కువ బరువుతో పుట్టే శిశువులు అరుదుగా ఊపిరి బిగబట్టి ఉండిపోతారని.. దీన్ని వైద్య పరిభాషలో ఎపెనిక్ స్పెల్గా పరిగణిస్తామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa