టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతరకరమైన పోస్టులు పెట్టిన చాలా మంది ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. వీరిని ప్రస్తుతం పోలీసు కేసుల భయం వెంటాడుతోంది. తాజాగా, నటి శ్రీరెడ్డిపై మరో కేసు నమోదైంది. గుంటూరు మాజీ కార్పోరేటర్ దాసరి జ్యోతి ఆమెపై ఫిర్యాదు మేరకు పోలీసులు స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో నోటికొచ్చినట్లు మాట్లాడిన శ్రీ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మాజీ కార్పొరేటర్ తన ఫిర్యాదులో కోరారు. దీంతో పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు.
మరోవైపు, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ హోంమంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని శ్రీరెడ్డిపై ఇంకో కేసు నమోదయ్యింది. వైఎస్ఆర్సీపీ హయాంలో సోషల్ మీడియా వేదికగా కూటమి నేతలపై శ్రీరెడ్డి తప్పుడు ప్రచారం చేశారంటూ టీడీపీ ఏపీ మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదయ్యింది. దీంతో సె్షన్ 196, 353(2), 79 BNS, 67 ITA-2000-2008 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండడంతో ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని మజ్జి పద్మ ఆరోపించారు. తక్షణమే ఆమెను అరెస్టు చేయాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో నోటికి పనిచెప్పి.. రెచ్చిపోయి విమర్శలు చేస్తూ.. భూతులు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలే లక్ష్యంగా శ్రీరెడ్డి పోస్ట్లు పెట్టారు. ఇప్పుడు ఆమె తప్పయిపోయిందని, తనను క్షమించాలంటూ వేడుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేశ్కు విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్ అయ్యింది. తాను తప్పు చేశానని, బుద్ది తక్కువై చేసిన వ్యాఖ్యలు ఎందరితో బాధించాయని ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలు, జనసేన వీర మహిళలు, వారి కుటుంబ సభ్యులకు ఇంతకు ముందే క్షమాపణలు చెప్పానని, తాను పరుషంగా అనేకసార్లు మాట్లాడాను అందుకే నేనే మరోసారి క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి భక్తురాలిగా ప్రమాణం చేసి చెపుతున్నానని, జుగుప్సాకరంగా మట్లాడి తప్పుచేశానని అన్నారు. పెద్దమనస్సుతో మీ తెలుగు అమ్మాయిని క్షమించండి అంటూ లేఖ రాస్తున్నాని చెప్పారు. ఒక వేళ భవిష్యత్తులో వైఎస్పార్సీపీ అధికారంలోకి వచ్చినా నాబుద్ది వక్రంగా మారదని,ఇకపై ఇష్టానుసారం అసభ్య భాష ఎవరిపై వాడనని ప్రమాణం చేస్తున్నానని . నా దాకా వచ్చే సరికి నేను చేసే తప్పు ఏంటో ఇప్పుడు అర్ధం అయ్యిందని వేడుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa