సంఘ సంస్కర్త, కవి, గాయకుడు, కృష్ణతత్వ భక్త అగ్రగణ్యుడు శ్రీ గురు కనకదాస జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు కొనియాడారు. కర్ణాటకలో జన్మించిన గురు కనకదాస.. దేశంలో పాతుకుపోయిన కుల వివక్షపై పోరాటం చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. రాయలసీమలోనూ కులవ్యవస్థ, అసమానతలపై చైతన్యం తీసుకొచ్చిన సామాజిక తత్వవేత్త కనకదాస అని చంద్రబాబు కీర్తించారు. బీసీలను, వారి సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ.. వారి ఉన్నతి కోసం ప్రతిఒక్కరూ పని చేయాల్సిన అవసరం గుర్తుచేసిన మహనీయుడు ఆయన అని ముఖ్యమంత్రి కొనియాడారు. భక్తి మార్గంలో ఆయన చేసిన బోధనలు నేటికీ అనుసరణీయం, ఆదర్శనీయమని చెప్పుకొచ్చారు. ప్రజలకు అర్థమయ్యే రీతిలో సరళమైన భాషలో ఎన్నో ఏళ్ల కిందటే గురు కనకదాస బోధనలు చేశారని సీఎం చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa