వీసా ప్రక్రియపై అవగాహన లేకపోవడం వల్ల పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభరత్ తెలిపారు. అలాంటి వారి కోసం వీసాపై అవగాహన కల్పిస్తూ సదస్సు నిర్వహించడం మంచి పరిణామమని ఆయన పేర్కొన్నారు. సోమవారం విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో యూఎస్ బిజినెస్, టూరిజం వీసాపై అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ సదస్సుకు ఎంపీ శ్రీభరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ.. యూఎస్కు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ వీసా అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని తెలుగు వారంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నారన్నారు. అయితే అమెరికా దేశాధ్యక్షుడిగా ఎవరు వచ్చినా.. యూఎస్, భారత్ మధ్య బంధం బలపడుతూనే ఉందని గుర్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa