ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గంజాయి, మాదకద్రవ్యాల తయారీ, అక్రమ రవాణాకు అడ్డుకట్టే వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ప్రభుత్వం.. ఈ దిశగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. హోం మంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో సచివాలయంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ బుధవారం సమావేశమైంది. ఈ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రి నారా లోకేష్, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.
ఈ భేటిలో ఏపీలో గంజాయి సాగు, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే ఏపీ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్గా నామకరణం చేశారు ఈ టాస్క్ ఫోర్స్ విధివిధానాలతో పాటు కీలక నిర్ణయాల దిశగా మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. మరోవైపు గంజాయి సాగు, రవాణాను అడ్డుకోవాలంటే.. గంజాయిని విక్రయించేవారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలనే ప్రతిపాదనపైనా మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. అనంతరం గంజాయి అమ్మేవారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు కట్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే పాఠశాలలు, కళాశాలలు, సచివాలయాల పరిధిలో పది మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేయాలని కేబినెట్ సబ్కమిటీ నిర్ణయించింది. ఈ కమిటీల్లో ఆశావర్కర్లు, మహిళా సంఘాలను కూడా భాగస్వామ్యులు చేయనున్నారు.
మరోవైపు గంజాయి సాగును అడ్డుకోవటానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. గంజాయి సాగు ఎక్కువగా జరిగే మన్యం ప్రాంతాల్లో.. వీటిని పండించకుండా ప్రత్యామ్నాయ పంటలవైపు ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలవైపు వారిని ప్రోత్సహిస్తూ.. అందుకు కావాల్సిన విత్తనాలను కూడా అందజేస్తున్నారు. అలాగే గంజాయి సాగును గుర్తించడానికి డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగిస్తున్నారు. తాజాగా గంజాయి విక్రయించే కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని నిర్ణయించటంతో.. కాస్తైన మార్పు వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa