ఏపీలో ఉద్యోగ విరమణ చట్ట సవరణకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. ఏపీలో న్యాయాధికారుల ఉద్యోగ విరమణ వయసు చట్ట సవరణకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో, న్యాయాధికారుల ఉద్యోగ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ చేసిన చట్ట సవరణకు ఆమోదముద్ర పడింది. ఈ మేరకు సవరించిన చట్టాన్ని గెజిట్లో ప్రచురించాలని న్యాయశాఖ ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ సవరణ బిల్లును ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ శాసనసభలో ఈ నెల 13వ తేదీన ప్రవేశపెట్టారు. ఇక, ఆ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది శాసనసభ… నవంబర్1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని బిల్లులో పేర్కొంది ప్రభుత్వం.. ఆ తర్వాత గవర్నర్ ఆమోదం కోసం రాజ్భవన్కు పంపించారు.. తాజాగా, ఉద్యోగ విరమణ చట్ట సవరణకు ఆమోద ముద్ర వేశారు గవర్నర్ అబ్దుల్ నజీర్.