పది రూపాయల గొడవ.. పోలీసుల వరకు వెళ్లింది. ఏడాదిన్నర క్రితం.. ఒక దుకాణంలో ఒక వ్యక్తి గుట్కా ప్యాకెట్ కొన్నాడు. అయితే ఆ గుట్కా ప్యాకెట్ డబ్బులు చెల్లించకుండా తీసుకెళ్లిన వ్యక్తి.. ఎంతకూ డబ్బు ఇవ్వలేదు. ఏడాదిన్నర పూర్తి కావడంతో ఆ దుకాణ యజమానికి విసుగు వచ్చింది. చివరికి అతడు డబ్బులు ఇవ్వకపోవడంతో.. చేసేదేమీ లేక పోలీసులకు ఫోనే చేసి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అక్కడికి వచ్చి వారిద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడి.. అతడి డబ్బులు ఇప్పించారు. దీంతో ఈ గొడవ అక్కడితో సద్దుమణిగిపోయింది. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని హర్దోయ్లో చోటు చేసుకుంది.
కొన్ని చిన్న చిన్న ఘటనలే చాలా పెద్ద సమస్యలుగా మారుతూ ఉంటాయి. కానీ కొన్ని సమస్యలకు సరైన పరిష్కారం ఆలోచిస్తే.. క్షణాల్లో పరిష్కారం అవుతూ ఉంటాయి. అలాంటిదే తాజాగా ఓ ఘటన జరిగింది. ఉత్తర్ప్రదేశ్ హర్దోయ్ జిల్లాలోని భండారీ గ్రామానికి చెందిన జితేంద్ర అనే ఓ వికలాంగుడు.. స్థానికంగా ఒక పాన్ షాప్ను నడిపిస్తున్నాడు. తాను రోజూ వివిధ వస్తువులు విక్రయించగా.. వచ్చిన డబ్బులతో కాలం వెళ్లదీసేవాడు. ఈ నేపథ్యంలోనే అదే గ్రామానికి చెందిన సంజయ్ అనే వ్యక్తి.. ఏడాదిన్నర కిందట.. జితేంద్ర పాన్ షాప్లో రూ.10 విలువైన గుట్కా ప్యాకెట్ను కొనుగోలు చేశాడు.
అయితే ఆ గుట్కా ప్యాకెట్కు డబ్బు ఇవ్వకుండా తర్వాత ఇస్తా అని చెప్పాడు. అప్పుడు సరే అని చెప్పినా తర్వాత ఎంత అడిగినా ఇవ్వలేదు. ఇలా అలా ఏడాదిన్నర పూర్తయింది. తనకు రావాల్సిన రూ.10 కోసం సంజయ్ని జితేంద్ర ఎన్నోసార్లు అడిగినా అందుకు అతడు ఇవ్వలేదు. దీంతో చివరికి విసిగిపోయిన జితేంద్ర.. పోలీస్ హెల్ప్లైన్ నంబర్ 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. వెంటనే భండారీ గ్రామానికి వచ్చిన పోలీసులు.. విచారణ జరిపారు. జితేంద్ర చెప్పింది విన్న పోలీసులు.. సంజయ్ని పిలిపించి మాట్లాడారు. చివరికి వారిద్దరి మధ్య గొడవను తొలగించి.. రూ.10ను జితేంద్రకు ఇప్పించడంతో కథ సుఖాంతం అయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa