ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చుడండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 02, 2024, 11:56 AM

తుఫాను ప్రభావిత ప్రాంతాల విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు (సోమవారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ప్రస్తుతం తుఫాను ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తుఫాను నష్టాన్ని మంత్రి గొట్టిపాటికి అధికారులు వివరించారు.


తిరుపతి జిల్లా పరిధిలో అధిక శాతం నష్టం వాటిల్లినట్లు తెలిపారు.మంత్రి ఆదేశాలతో తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ప్రత్యేక బృందాలతో అధికారులు పనులు చేపట్టారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. అయితే 95 శాతం మేరకు విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి అయ్యాయని.. మధ్యాహ్నం కల్లా విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని మంత్రికి తెలిపారు. ప్రజలకు ఏ ఇబ్బందీ రానీయొద్దని.. తుపాన్ తగ్గే వరకు అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa