ఏపీలో మద్యం షాపులు దక్కించుకున్నవారు కష్టాలు పడుతున్నామని చెబుతున్నారు. తమకు 20శాతం మార్జిన్ వస్తుందనుకుంటే.. 10శాతం మాత్రమే వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విజయవాడలో సమావేశమై ఈ అంశంపై చర్చించారు.. ఈ మేరకు మార్జిన్ పెంచాలంటూ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్కుమార్ మీనా కీలక నిర్ణయం తీసుకున్నారు. నూతన మద్యం విధానం ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లుగా.. తమకు 20 శాతం ట్రేడ్ మార్జిన్ దక్కేలా చూడాలంటూ ఆంధ్రప్రదేశ్ వైన్ డీలర్స్ అసోసియేషన్ ఇచ్చిన వినతి పత్రంపై సమగ్ర నివేదిక సమర్పించాలని మీనా అధికారుల్ని ఆదేశించారు.
మద్యం షాపులు దక్కించుకున్న తమకు.. ప్రస్తుతం తమకు 10 శాతం మార్జిన్ మాత్రమే వస్తోందంటున్నారు వ్యాపారులు. మార్జిన్ 10శాతం అయితే తాము నష్టాల్లోకి వెళ్లి, లైసెన్సు రుసుములు చెల్లించలేని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గత నెల 18న ఆంధ్రప్రదేశ్ వైన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాయల సుబ్బారావు ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చారు. అందులోని అంశాలను పరిశీలించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్కుమార్ను ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. ఇటు బార్లలో చిన్న చిన్న ఉల్లంఘనలకూ లైసెన్సు రుసుముకు రెండింతల మేర జరిమానాలు విధిస్తున్నారని.. దాన్నీ తగ్గించాలని కోరారు. ఈ అంశంపైనా నివేదిక అందజేయాలని సూచించారు. ఎక్సైజ్ కమిషనర్ వినతిపై స్పందించడంతో మద్యం షాపులు దక్కించుకున్నవారికి కొంత ఊరట దక్కిందని చెప్పాలి.
మరోవైపు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగడా మద్యాన్ని ఎమ్మార్పీకి మించి విక్రయించినా.. బెల్ట్షాపుల్లో అమ్మినా లైసెన్సుదారులకు ప్రభుత్వం భారీగా జరిమానాలు విధిస్తామని ప్రకటించింది. ఈ నిబంధనల్ని ఉల్లంఘించి తొలిసారి దొరికితే రూ.5 లక్షలు జరిమానా విధిస్తారు. రెండోసారి దొరికితే మద్యం షాపును లైసెన్సునే రద్దు చేస్తారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.
అంతేకాదు పన్ను చెల్లించని మద్యం, కల్తీ, నకిలీ మద్యం విక్రయిస్తూ చిక్కితే జరిమానాలు కాకుండా లైసెన్సు రద్దు చేస్తారు. ఇతర ఉల్లంఘనలకు పాల్పడి తొలిసారి దొరికితే రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు, రెండోసారి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. మూడోసారి లైసెన్సు రద్దు చేస్తారని తెలిపారు. మద్యంంపై మార్జిన్ పెంచకపోతే తాము నష్టపోతామంటున్నారు షాపుల యజమానులు. 20 శాతం మార్జిన్ ఇస్తే తప్ప ఈ కష్టాల నుంచి గట్టెక్కలేమంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తాము లైసెన్స్ ఫీజుల్ని కూడా చెల్లించలేమంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa