టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఆనంద నిలయం అనంత స్వర్ణమయం దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనం(జనరల్) కల్పించనుంది. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్ (జనరల్) దర్శనాలను ఇవ్వాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. 2008లో టీటీడీ సంకల్పించిన ఈ పథకాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిపివేసిన సంగతి సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు అర్చనానంతర దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు అర్చనానంతర దర్శన సేవ లేకపోవడంతో ప్రస్తుత పాలక మండలి ఈ పథకం దాతలకు ప్రత్యామ్నాయంగా వీఐపీ బ్రేక్ (జనరల్) దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది.
ఆనంద నిలయం అనంత స్వర్ణమయం దాతలకు సవరించిన సౌకర్యాల వివరాలను టీటీడీ వెల్లడించింది. అర్చనానంతర దర్శనానికి బదులుగా గరిష్టంగా 5 మంది కుటుంబ సభ్యులకు సంవత్సరానికి 3 రోజులు వీఐపీ బ్రేక్ (జనరల్) దర్శనాలకు అనుమతిస్తారు. రూ.2,500/- టారిఫ్లో సంవత్సరానికి 3 రోజులు వసతి కల్పిస్తారు. సంవత్సరానికి ఒకసారి 20 చిన్న లడ్డూలు ప్రసాదంగా అందిస్తారు. దాతల దర్శన సమయంలో ఏడాదికి ఒకసారి బహుమానంగా ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ బహుమానంగా అందిస్తారు. దాతల మొదటిసారి దర్శన సమయంలో 5 గ్రాముల బంగారు డాలర్, 50-గ్రాముల వెండి నాణెం బహుమానంగా అందజేస్తారు. సంవత్సరానికి ఒకసారి పది మహాప్రసాదం ప్యాకెట్లు అందిస్తారు.. విరాళం పాస్బుక్ జారీ చేసిన తేదీ నుంచి 25 ఏళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుంది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ఉదయం, సాయంత్రం వాహన సేవలలో 2.5 టన్నుల బరువు ఉన్న వాహనాన్ని మోస్తున్న శ్రీరంగం శ్రీవైష్ణవులను గురువారం 10 గ్రాముల శ్రీవారి వెండి డాలర్, స్వామి వారి ప్రసాదాలతో టీటీడీ ఈవో శ్యామలరావు సన్మానించారు. శ్రీవైష్ణవ సంప్రదాయపరులు గత 32 ఏళ్లుగా విశేష సేవలు అందిస్తున్నారన్నారు ఈవో. ఒక్కో వాహనానికి మర్రి ఊడలతో తయారు చేసిన 28 అడుగుల పొడువైన 4 తండ్లు, కొయ్యతో తయారు చేసిన రెండు అడ్డ పట్టీలు, గొడుగు పలకలు, ఇద్దరు అర్చకులు, గొడుగులు పట్టుకునేందుకు మరో ఇద్దరు ఉంటారన్నారు. వీటి అన్నింటినీ కలిపితే ఒక్కో వాహనం దాదాపు 2.5 టన్నులకు పైగా బరువు ఉంటుందని తెలిపారు.
ఉదయం, రాత్రి వాహనసేల్లో ఒక్కో వాహన సేవలో దాదాపు మూడు గంటలు పాటు బరువును మోస్తూ వాహన బ్యారర్లు తమ భక్తి భావాన్ని చూపుతూ, వాహన బ్యారర్ల తమ భుజాలు మీద మోయడం మూలంగా భుజంపై ఉబ్బి కాయ కాసినా ఏ మాత్రం సంకోచించకుండా అమ్మవారి సేవలో తరిస్తున్నారన్నారు. మొదట్లో నాకు కొంత సంకోచం ఉండేదని, అంత బరువును మోస్తున్నారా అనే అనుమానం ప్రత్యక్షంగా చూశాక నివృత్తి అయిందన్నారు. ఇదే అంశాన్ని జాతీయ, ప్రాంతీయ మీడియాతో పాటు ఎస్వీబీసీ ప్రపంచానికి తెలిసేలా కథనాలు రాశారన్నారు. వాహన బేరర్లు అందరూ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఐటి రంగంలోను, రైల్వే ఉద్యోగులు, బ్యాంక్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులుగా పని పనిచేస్తున్నారని, వీరితోపాటు విద్యార్థులు కూడా ఉన్నట్లు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa