అనంతపురం జిల్లాలో ఓ పెళ్లిలో హైడ్రామా నడిచింది. పీటలపై నుంచి వరుడు వెళ్లిపోవడంతో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. ఏం జరిగిందని ఆరా తీస్తే.. అసలు విషయం తెలిసి అందరూ అవాక్కయ్యారు. గుత్తిలో గురువారం ఓ పెళ్లి జరుగుతోంది.. వరుడు పీటలపైకి వచ్చాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో వరుడు పీటలపై నుంచి లేచి వెళ్లిపోయాడు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. వరుడు అలా వెళ్లిపోవడానికి కారణం ఏంటని ఆరా తీశారు.
వరుడు అలా వెళ్లిపోవడానికి కారణం.. తన వాళ్లకు పెళ్లిలో కనీస మర్యాద ఇవ్వలేదట. పెళ్లి మధ్యలోనే ఆగిపోవడంతో వధువు తల్లి ఆందోళనతో బీపీ ఎక్కువై కళ్లు తిరిగి అక్కడే పడిపోయారు. వెంటనే ఆమెను బంధువులు ఆసుపత్రికి తరలించారు. అసలు వరుడి ఎక్కడికి వెళ్లాడో ఆచూకీ ఎంతకీ తెలియక పోవడంతో వధువు తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన వ్యక్తి చేశారు. పెళ్లి మధ్యలో ఆగిపోవడంతో.. వరుడు, వధువు తరఫు బంధువులు ఘర్షణకు దిగారు.
ఆ తర్వాత అందరూ కలిసి వరుడు ఎక్కడ ఉన్నాడో ఆరా తీశారు. చివరకు వరుడిని తీసుకొచ్చి.. వారి తల్లిదండ్రులను బంధువులు, పెద్దలు బుజ్జగించడంతో అలక వీడారు. దీంతో ఉదయం జరగాల్సిన పెళ్లి సాయంత్రం సుమారు 4గంటలకు జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వరుడు ఇలా మర్యాద ఇవ్వలేదని అలకబూని పీటలపై నుంచి వెళ్లిపోవడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చిన్న విషయానికే ఇలా చెప్పకుండా వెళ్లిపోవడం ఏంటని చర్చించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa