ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గత పాలనలో గ్రామాల అభివృద్ధికి కుంటుపడింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 14, 2024, 04:08 PM

కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. అరసవల్లి నగరంలోని విశాఖ-ఏ కాలనీలో గల ఆయన కార్యాలయంలో కల్లేపల్లి గ్రామస్థులు ఎమ్మెల్యే సమక్షం లో టీడీపీలో చేరారు. వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని, కనీస మౌలిక వసతులకు కూడా నోచుకోక ద యనీయ స్థితికి చేరుకున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో కార్యకర్తలకు సముచిత గౌరవం లభిస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పాలనకు మద్దతుగా ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో టీడీ పీ నాయకులు మూకళ్ల శ్రీను, మూకళ్ల జయా నంద్‌, శీర రమణయ్య, పార్టీ మండల నాయ కులు, కార్యకర్తలు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa