ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దొంగతనానికి పాల్పడిన దుండగుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 14, 2024, 04:27 PM

కుటుంబ సభ్యుడే ఏడు తులాల బంగారం కాజేసిన వైనం విజయనగరం జిల్లా, రేగిడి మండలం ఉంగరాడమెట్ట గ్రామంలో చోటుచేసుకుంది. చోరీ జరిగిన కొద్ది గంటల్లోనే క్లూస్‌టీం సహాయంతో స్థానిక పోలీసులు నిందితుడిని పట్టుకుని, బంగారాన్ని రికవరీ చేశారు. ఈ ఘటనపై ఎస్‌ఐ నీలావతి శుక్రవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉంగరాడమెట్ట గ్రామంలో నివాసం ఉంటున్న కరమి స్వామి ఇటీవల తన భార్యతో కలిసి చీరాల వలస వెళ్లారు. ప్రస్తుతం ఇంటి వద్ద పెద్ద కుమార్తె పావని ఉంటోంది. అయితే పావనీ చెల్లి నిండుగర్భిణీ కావడంతో డెలివరీ నిమిత్తం ఈనెల 10న రాజాం ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో పావని ఇంటికి తాళం వేసి, ఆస్పత్రిలో తన చెల్లికి తోడుగా ఉంటోంది. దీన్ని గమనించిన రాజాం మండలం అంతకాపల్లికి చెందిన వీరి కుటుంబ సభ్యుడు, పావనీ భర్త రాంబాబు ఈనెల 11న అర్ధరాత్రి ఇంట్లో చొరబడ్డాడు. పెట్టెలో ఉన్న ఏడు తులాల బంగారు ఆభరణాలు అపహరించుకుపోయాడు. ఈనెల 12న ఆస్పత్రి నుంచి వచ్చిన పావని ఇంట్లోకి వెళ్లి చూడగా, వస్తువులన్నీ చిందర వందరగా పడి ఉన్నాయి. బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో అదే రోజు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం క్లూస్‌టీం వచ్చి పరిశీలించింది. క్లూస్‌ టీం సహాయంతో పోలీసులు కొద్ది గంటల్లోనే నిందితుడిని పట్టుకుని, చోరీ సొత్తును రికవరీ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa