ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమెతో శారరీకంగానూ కలిశాడు. కానీ ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు అతడితో మాట్లాడారు. పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశారు. ఎంతకూ ఒప్పుకోకపోవడంతో అతడిని కిడ్నాప్ చేశారు. అచ్చం సినిమాల్లో చూపించినట్లుగానే రెండు స్కార్ఫియోల్లో 12 మంది వెళ్లి యువకుడిని లాక్కొచ్చారు. గన్నుతో బెదిరించి మరీ యువతి మెడలో తాళి కట్టించారు. అయితే ఇది ఎక్కడ జరిగింది, ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బిహార్లోని బెగుసరాయ్ జిల్లా రాజౌరాలో అవనీష్ కుమార్ అనే ఓ యువకుడు ఉన్నాడు. అయితే అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో నాలుగేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఆమెకు కూడా ఇతడు అంటే చాలా ఇష్టం. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. చాలా సార్లు శారీరకంగానూ దగ్గరయ్యారు. అక్కడి గ్రామస్థులందరికీ వీరి ప్రేమ గురించి తెలుసు. అయితే ఇటీవలే అవనీష్ కుమార్కు ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఇక అప్పటి నుంచి అతను.. తన ప్రేయసితో మాట్లాడడం మానేశాడు. ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయడం లేదు. ఓసారి అతడిని అడ్డగించి పెళ్లి చేసుకోమంటే నో చెప్పాడు.
ఇక అప్పటి నుంచి సదరు యువతి రోజూ తన ప్రియుడి గురించే ఆలోచిస్తూ కన్నీరుమున్నీరు అవుతుంది. అది చూసిన యువతి కుటుంబ సభ్యులు ఏమైందని అడిగారు. అవనీష్ కుమార్తో ప్రేమ గురించి అతడు తనతో మాట్లాడకపోవడం గురించి చెప్పింది. అదంతా విన్నకుటుంబ సభ్యులు అతడితో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేదు. దీంతో తమ కూతురును మోసం చేసిన అబ్బాయిని తీసుకువచ్చి ఎలాగైనా సరే పెళ్లి చేయాలనుకున్నారు. ఇదే విషయాన్ని గ్రామంలోని పలువురు యువకులకు చెప్పారు. వాళ్లు కూడా సాయం చేసేందుకు ఒప్పుకున్నారు.
ఇలా అవనీష్ కుమార్ ఉద్యోగానికి వెళ్తున్న సమయంలో.. రెండు స్కార్ఫియోల్లో వెళ్లి అతడి ముందు ఆపారు. అతడిని పట్టుకుని కొట్టారు. ఆపై వాళ్ల వెంట తీసుకువెళ్లిన గన్నులతో బెదిరించి స్కార్ఫియోల్లో ఎక్కించుకుని యువతి ఇంటికి తీసుకువెళ్లారు. అప్పటికే పెళ్లికూతురు గెటప్లో ముస్తాబై రెడీగా ఉంది అమ్మాయి. వెంటనే అబ్బాయిని పాయింట్లో గన్ పెట్టి ఆమె మెడలో తాళి కట్టమని చెప్పారు. భయపడి వారు చెప్పినట్లుగానే చేశాడు. ఆ తర్వాత నుదిటన బొట్టు కూడా పెట్టాడు. ఇలా ఈ క్రతువు ముగించారు.
పెళ్లి తర్వాత అమ్మాయిని అవనీష్ కుమార్ను.. వరుడి ఇంటికి తీసుకువెళ్లారు. కానీ అబ్బాయి తరఫు వాళ్లు వీరి పెళ్లిని నిరాకరించారు. వధూవరులను ఇంట్లోకి కూడా రానివ్వలేదు. దీంతో వధువు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈక్రమంలోనే అవనీష్.. తనను కిడ్నాప్ చేసి మరీ లాక్కెళ్లారని.. అక్కడే అమ్మాయితో పెళ్లి చేశారని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమ్మాయితో తనకు ఎలాంటి సంబంధం లేదని.. బలవంతంగా తనకు వివాహం జరిపించారని అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa