చాలా మంది పెళ్లిళ్లు అయిన అతి తక్కువ కాలంలోనే విడాకులు తీసుకుంటారు. మరికొందరు పెళ్లి జరిగిన 5 నుంచి 10 ఏళ్ల మధ్య గొడవలు వచ్చి భాగస్వాములకు దూరం అవుతుంటారు. కానీ పెళ్లి జరిగిన 44 ఏళ్లకు ఓ జంట విడిపోయింది. అది కూడా వారికి వృద్ధాప్యం వచ్చాక. 73 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి తన 70 ఏళ్ల భార్యకు విడాకులు ఇచ్చాడు. 18 ఏళ్ల పాటు న్యాయపోరాటం చేసి మరీ తన భార్యకు దూరం అయ్యాడు. అంతేకాకుండా కోట్లలో భరణం చెల్లించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హర్యానాలోని కర్నాల్ జిల్లాకు చెందిన 73 ఏళ్ల వృద్ధుడు.. తన 70 ఏళ్ల భార్యకు తాజాగా విడాకులు ఇచ్చాడు. 1980వ సంవత్సరం ఆగస్టు 27వ తేదీన ఘనంగా వివాహం చేసుకున్న ఈ జంట చాలా సంతోషంగా గడిపింది. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. అయితే ఇందులో ఇద్దరు కుమార్తెలు ఉండగా మరొకరు కుమారుడు. అయితే పిల్లలను చదివిస్తూ.. భార్యను చాలా సంతోషంగా చూసుకున్న భర్తలో కొన్నేళ్ల తర్వాత మార్పు మొదలు అయింది.
భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు జరగడంతో వీరు దూరంగా ఉండాలనుకున్నారు. 2006వ సంవత్సరం మే 8వ తేదీ నుంచి విడివిడిగా జీవించడం ప్రారంభించారు. అప్పటి నుంచి భర్త.. భార్య నుంచి విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాడు. కర్నాల్లోని కుటుంబ న్యాయస్థానంలో విడాకుల కోసం పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే కర్నాల్ కోర్టు 2013 జనవరిలో విడాకుల అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో తమ వివాహాన్ని ఎలాగైనా సరే రద్దు చేసుకోవాలని భావించిన అతడు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశాడు.
దాదాపు 11 సంవత్సరాలు ఈ అంశం పెండింగ్లో ఉన్నందు రాజీ అవకాశాల కోసం నవంబర్ 4వ తేదీన హైకోర్టు.. ఈ విషయాన్ని మధ్యవర్తిత్వం మరియు రాజీ కేంద్రానికి సూచించింది. ఈ ప్రక్రియలో భాగంగానే భర్త.. భార్యతో విడాకులు తీసుకున్నారు. ముఖ్యంగా భార్యకు శాశ్వత భరణంగా మొత్తం 3.07 కోట్ల రూపాయలను చెల్లించేందుకు అంగీకరించారు. భార్యతో పాటు ఆమె ముగ్గురు పిల్లలు కూడా ఇందుకు ఓకే చెప్పారు. అయితే తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి భర్త తన భూమిని అమ్మ మరీ డిమాండ్ డ్రాఫ్ట్గా 2 కోట్ల 16 లక్షల రూపాయలను చెల్లించాడు. అలాగే తన పంటలను అమ్ముకొని 50 లక్షల నగదును కూడా చెల్లించాడు. ఆపై 40 లక్షల రూపాయల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను కూడా భార్య, పిల్లలకు అప్పగించాడు.
మొత్తం 18 ఏళ్ల న్యాయ పోరాటంతో 44 ఏళ్ల తమ వివాహ బంధానికి ఈ జంట స్వస్తి పలికింది. శాశ్వత భరణంగా రూ.3.07 కోట్ల చెల్లించి వృద్ధుడు సెన్సేషన్ క్రియేట్ చేశాడు. భవిష్యత్తులో ఇతడు చనిపోతే.. ఆయన భార్య, పిల్లలకు ఈయన ఆస్తిపై ఎలాంటి హక్కు ఉండదు. వారు కేసులో కోర్టు వేసినా చెల్లదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa