ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలెక్టరేట్‌ వద్ద ఆందోళనకి దిగిన వ్యాపారులు, కార్మికులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 17, 2024, 07:31 PM

పార్వతీపురం మన్యం కలెక్టరేట్‌ సోమవారం నిరసనలతో హోరెత్తింది. వివిధ ఉద్యోగులు, వ్యాపారులు, కార్మి కులు, సంఘాల నాయకులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన చేపట్టారు.జిల్లాలోని పలు కేజీబీవీల్లో డైలీవేజ్‌ కింద పనిచేసిన వర్కర్లు తమను అకారంగా విధుల్లోంచి తొలగించారని కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టారు. విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.పాఠశాలల్లో పనిచేస్తున్న తమకు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని ఆయాలు నిరసన తెలిపారు.పార్వతీపురం పట్టణంలో ఫుట్‌పాత్‌పై వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఫుట్‌పాట్‌, తోపుడు బళ్ల వ్యాపారులు పాత బస్టాండ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. సంక్రాంతి వరకు తమకు సమయం ఇచ్చి, తర్వాత ఎక్కడ చెబితే అక్కడ బళ్లు పెట్టుకుని వ్యాపారం చేసుకుం టామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa