అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వడమే లక్ష్యంగా.. శ్రేయస్ అయ్యర్ దేశవాళీ ట్రోఫీలో చెలరేగిపోతున్నాడు. తన కెప్టెన్సీలో వరుస టైటిళ్లు సాధించిన ఈ ప్లేయర్.. వ్యక్తిగతంగానూ పరుగుల వరద పారిస్తున్నాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో తన నాయకత్వంలో ముంబైని ఛాంపియన్గా నిలిపిన శ్రేయస్ అయ్యర్.. దేశవాళీ టోర్నీ విజయ హజారే ట్రోఫీలోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు. 51 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. దీంతో తన తొలి మ్యాచ్లో ముంబై భారీ స్కోరు చేసింది.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబై, కర్ణాటక జట్లు తలపడ్డాయి. గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన కర్ణాటక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్.. పెను విధ్వంసం సృష్టించాడు. వన్డే మ్యాచ్లో టీ20 తరహాలో రెచ్చిపోయాడు. ఏకంగా 51 బంతుల్లోనే మూడంకెల మార్కు చేరుకున్నాడు.
నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అయ్యర్.. కర్ణాటక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మొత్తంగా 55 బంతుల్లోనే 114 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇందులో 10 సిక్స్లు, ఐదు ఫోర్లు ఉన్నాయి. మొత్తంగా 200లకు పైగా స్ట్రైక్ రేటుతో శ్రేయస్ అయ్యర్ ఈ పరుగులు సాధించాడు. శివమ్ దూబె (36 బంతుల్లో 63 రన్స్), హార్దిక్ తామోర్ (94 బంతుల్లో 84 రన్స్) చేయడంతో ఈ మ్యాచ్లో ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది.
కాగా ఈ ఏడాది శ్రేయస్ అయ్యర్.. గత కొన్ని నెలలుగా మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ను ఛాంపియన్గా నిలిపాడు. ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలోనూ ముంబైని విజేతగా నిలిపాడు. విజయ్ హజారే ట్రోఫీలోనూ తొలి మ్యాచ్లో తనదైన శైలిలో రెచ్చిపోయాడు. అయ్యర్ చివరగా ఈ ఏడాది జనవరిలో ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో ఆడాడు. ఆ తర్వాత భారత జట్టుకు దూరమయ్యాడు. వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టులో చోటు సంపాదించడమే లక్ష్యంగా దూసుకెళ్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa