కర్ణాటకలోని తుమకూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళతో మధుగిరి డివైఎస్పీ రామచంద్రప్ప అసభ్యకరంగా ప్రవర్తించాడు. భూవివాదానికి సంబంధించి ఓ మహిళ పీఎస్కు వచ్చింది. ఈ క్రమంలో రామచంద్రప్ప ఆమెను ఓ ప్రైవేట్ గదికి తీసుకెళ్లి అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుండడంతో.. రామచంద్రప్ప అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అధికారులు స్పందించి డీవైఎస్పీపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa