ఇజ్రాయెల్ దేశానికి హమాస్ మిలిటెంట్ గ్రూపునకు మధ్య యుద్ధం చాలా రోజులుగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. కొన్ని నెలలుగా ఇజ్రాయెల్ గాజాపై వరుస దాడులకు పాల్పడుతోంది. 20 రోజుల క్రితమే వైమానికి దాడులు చేసి 30 మంది కంటే ఎక్కువ మంది ప్రాణాలు పోయేలా చేసిన ఇజ్రాయెల్.. తాజాగా మరోసారి దాడులకు పాల్పడింది. అయితే ఈ ఘటనలో 50 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇందులో ఎక్కువగా మహిళలు, చిన్న పిల్లలు ఉండడం గమనార్హం.
ఇజ్రాయెల్ స్వయంగా మానవతా జోన్గా ప్రకటించిన మువాసీతో పాటు డెయిర్ అల్ బలాహ్, ఖాన్ యూనిస్ వంటి ప్రాంతాలపై కూడా వైమానికి దాడులు చేసింది. ముఖ్యంగా శరణార్థులకు అవాసం కల్పించిన మువాసిపై తాజాగా గురువారం అర్ధరాత్రి దాడికి పాల్పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలు సహా ఇద్దరు హమాసీ పోలీసులతో పాటు మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అల్-బలాహ్లో జరిగిన మరో దాడిలో స్థానిక సహాయ కాన్వాయ్ భద్రతా కమిటీలోని 8 మంది సభ్యులు చనిపోయారు.
దక్షిణ గాజాలో, ఖాన్ యూనిస్లో ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ గాజాలోని హమాస్ అంతర్గత భద్రత అధిపతి మానవతా జోన్లో తలదాచుకున్నారని ఆరోపిస్తూ దాడికి పాల్పడినట్లు ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి వెల్లడించారు. మగాజీలో మరో ముగ్గురు పాలస్తీనా పౌరులు వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగానే ప్రాణాలు కోల్పోయారు. మఘాజీ, నుసిరత్ శరణార్ధి శిబిరాలతో పాటు సెంట్రల్ గాజాలో జరిగిన అదనపు దాడుల్లో చిన్న పిల్లలు సహా కనీసం 24 మంది మరణించారు.
ఇజ్రాయెల్ పదేపదే గాజా పోలీసు బలగాలను లక్ష్యంగా చేసుకునే ఈ దాడులకు పాల్పడుతోంది. అయితే వీటి వల్ల అమాయక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కనీసం తినేందుకు తిండి, వైద్య సహాయం కూడా అందన నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ దాడుల జరగడానికి ముందు వరకు హమాస్ పోలీసు దళమే ప్రజా భద్రతను కొనసాగించింది. కానీ దాడుల తర్వాత వీటి ఉనికి పూర్తిగా తగ్గిపోయింది.
2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్పై హమాస్ పెద్ద ఎత్తున దాడి చేసింది. ఈ ఘటనలో మొత్తం 1200 మంది ఇజ్రాయెల్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అలాగే 251 మందిని మిలిటెంట్ సంస్థ బందీలుగా చేసుకుంది. ఇఖ అప్పటి నుంచి ఇజ్రాయెల్.. గాజాపై తీవ్ర దాడులు చేస్తోంది. తమ పగ తీర్చుకోవడానికి అనేక మంది పాలస్తీనా పౌరుల ప్రాణాలు తీస్తోంది. వరుసగా దాడులుగా చేస్తుండగా.. దాదాపు 2.3 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లు కోల్పోయిన పాలస్తీనియన్లంతా శరణార్థులుగా మారి పలు శిబిరాల్లో తల దాచుకుంటున్నారు. ఆ విషయం గుర్తించిన ఇజ్రాయెల్ శిబిరాలే లక్ష్యంగా వైమానికి దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు టైల్అవీవ్ దాడులతో మొత్తం 45 వేల మంది పాలస్తీనియన్లు చనిపోయారని అక్కడ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa