సంక్రాంతి పండుగ సందర్భంగా దృష్ట్యా అదనంగా 7,200 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు మంగళవారం ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. జనవరి 8 నుంచి 13 వరకు అదనంగా 3,900 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. హైదరాబాద్ నుంచి పలు చోట్లకు 2,153 బస్సులు, బెంగళూరు నుంచి పలుచోట్లకు 375 బస్సులు నడపనున్నట్లు తెలిపింది. ఒకేసారి రెండు వైపులా టికెట్లు బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఎండీ ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa