ఈ నెల 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరయ్యే అవకాశం ఉన్నట్టు పలు మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి.73 ఏళ్ల మాజీ ఆర్మీ జనరల్ సుబియాంటో 2024 అక్టోబర్లో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ పర్యటనలో ఆయన ఇరుదేశాల సంబంధాలపై ప్రధాని మోడీతో విస్త ృత చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. గత ఏడాది ప్రబోవో ప్రధాని మోడీకి ఫోన్కాల్ చేసి.. ఇరుదేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. నవంబర్లో బ్రెజిల్లోని రియో డి జనిరోలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులో ప్రబోవో ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తో వాణిజ్యం, ఆరోగ్యం, భద్రత వంటి రంగాలలో సహకారంపై చర్చించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa