బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టిన తెలుగు క్రికెటర్ నితీశ్ రెడ్డి.. తన తొలి సిరీస్లోనే అదరగొట్టాడు. బ్యాటింగ్, బౌలింగ్లో సత్తాచాటాడు. ముఖ్యంగా మెల్బోర్న్ టెస్టులో సెంచరీ సాధించి.. జట్టుకు ఫాలో ఆన్ ముప్పును తప్పించాడు. ఇటీవలే ఆస్ట్రేలియా నుంచి విశాఖపట్నంలోని తన ఇంటికి వచ్చాడు ఈ ప్లేయర్. తాజాగా తెలుగు ప్రజల ఇలవేల్పు తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లాడు.
కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి వచ్చిన ఈ ప్లేయర్.. మెట్ల మార్గంలో వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నాడు. మోకాళ్ల పర్వతం వద్ద నితీశ్ మోకాళ్లపై మెట్లెక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అతడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సత్తాచాటిన ఈ ప్లేయర్.. తన మొక్కు తీర్చుకునేందుకు ఇలా మోకాళ్లపై నడిచాడు! చాలా మంది భక్తులు తమ కోర్కెలు నెరవేరితే ఇలా నడుస్తామని మొక్కుకుంటారు. ఆ తర్వాత అనుకున్నట్లు జరిగితే.. మొక్కు చెల్లించుకుంటారు. నితీశ్ రెడ్డి కూడా తన మొక్కు చెల్లించుకున్నాడు. ఇక తిరుమలకు చేరుకున్న నితీశ్ కుమార్ రెడ్డిని టీటీడి పాలక బృందం స్వాగతం పలికింది.
ఇక ఇటీవలే ఆస్ట్రేలియాలో ముగిసిన బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శన చేశాడు. హార్దిక్ పాండ్యా ప్లేసును భర్తీ చేసేందుకు పేస్ ఆల్రౌండర్గా జట్టులోకి వచ్చి.. సత్తాచాటాడు. ముఖ్యంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్లో జరిగిన నాలుగో టెస్టులో శతక్కొట్టాడు. 171 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్తో భారత జట్టు తరఫున తన తొలి సెంచరీ నమోదు చేశాడు.
ప్రస్తుతం రెస్ట్ మోడ్లో ఉన్న నితీశ్.. త్వరలోనే భారత జట్టుతో కలవనున్నాడు. ఈనెల 22 నుంచి ఇంగ్లాండ్ తో జరగబోయే 5 మ్యాచ్ల టీ20 సిరీస్కు అతడు ఎంపికయ్యాడు. మెరుగైన ప్రదర్శన చేస్తున్న అతడిని ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపిక చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్..
తొలి టీ20: జనవరి 22 (కోల్కతా)
రెండో టీ20: జనవరి 25 (చెన్నై)
మూడో టీ20: జనవరి 28 (రాజ్కోట్)
నాలుగో టీ20: జనవరి 31 (పుణె)
ఐదో టీ20: ఫిబ్రవరి 02 (ముంబై)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa