తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్లైన్ కోటాను టీటీడీ విడుదల చేయనుంది. రేపు(జనవరి 18) శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఏప్రిల్ నెల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటాను రేపు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం రేపు ఉదయం పది గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న వారు జనవరి 20 నుంచి 22 మధ్యాహ్నం 12లోపు డబ్బులు చెల్లిస్తే లక్కీ డిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తారు.
అలాగే ఏప్రిల్ నెలకు సంబంధించిన ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల ఆర్ధిత సేవా టికెట్లను జనవరి 21వ తేదీ ఉదయం పదింటికి విడుదల చేస్తారు. శ్రీవారి వర్చువల్ సేవలు, దర్శనం స్లాట్లు ఏప్రిల్ నెల కోటాను జనవరి 21న మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్ లైన్లో టీటీడీ విడుదల చేస్తుంది. ఏప్రిల్ నెల అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జనవరి 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్ల కోటాను జనవరి ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కల్పించే ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్ లైన్ కోటాను జనవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. అలాగే జనవరి 24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఏప్రిల్ నెల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఏప్రిల్ నెలకు సంబంధించి గదుల కోటాను ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీవారి భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆర్జితసేవలు, దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa