ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన అరకు ఉత్సవ్ను నిర్వహిస్తోంది. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఏర్పాట్లపై సమీక్ష చేశారు. ఈ నెల 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో నిర్వహించే అరకు ఉత్సవ్ను సందర్శకులను ఆకట్టుకునేలా నిర్వహించాలని సూచించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని.. అరకు ఉత్సవ్పై విస్తృత ప్రచారం నిర్వహించాలి అన్నారు. అరకు ఉత్సవ్ ప్రమోషన్ క్యాంపైన్లో భాగంగా.. లంబసింగి, వంజంగి, తాజంగి, కొత్తపల్లి జలపాతాలు, చాపరాయి వంటి ప్రదేశాలతో కూడిన వీడియోలను ప్రదర్శించాలన్నారు.ఈ ఉత్సవాలకు మూడు రోజుల పాటూ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే కళాకారులతో రోజువారీ కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు కలెక్టర్. అరకు ఉత్సవ్ కోసం వచ్చే కళాకారులకు అవసరమైన వసతి, భోజన, రవాణా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ మేరకు అవసరమైన కమిటీలను ఏర్పాటు చేయాలని.. అధికారులకు విధులు, బాధ్యతలను స్పష్టం చేయాలి అన్నారు. అంతేకాదు ఉత్సవ్ కార్యక్రమాలకు అయ్యే ఖర్చుపై బడ్జెట్ అంచనాలను రూపొందించాలని కూడా సూచనలు చేశారు. అరకు ఉత్సవ్కు సంబంధించి ఆహ్వాన పత్రికల్ని ప్రొటోకాల్ ప్రకారం సిద్ధం చేయాలి అన్నారు. అరకు ఉత్సవ్లో స్ట్రీట్స్ లైట్స్, వెల్కమ్ ఆర్చ్లు ఏర్పాటు చేయాలని.. ఈ మూడు రోజుల పాటూ పారిశుధ్యం నిర్వహణ, మొబైల్ టాయిలెట్ల ఏర్పాటుకు విశాఖపట్నం జీవీఎంసీ సహకారం తీసుకోవాలని సూచనలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa