ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజవర్గంలో మరోసారి టీడీపీ-బీజేపీ నాయకులు, కార్యక ర్తల మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. ఒకరిపై ఒకరు నాయకులు దాడులు చేసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ యువ నాయకుడు పరిటాల శ్రీరాం.. తాజా పరిణామాలపై తన కార్యకర్తలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా పార్టీని పరిరక్షించుకు నేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు.ధర్మవరం వైసీపీ నాయకు, మైనారిటీ నేత జమీర్.. కొన్నాళ్లుగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేప థ్యంలో ఆయనను పార్టీలో చేర్చుకోవాలని టీడీపీ నాయకుడు పరిటాల రవి ప్లాన్ చేసుకున్నారు. దీనికి సంబంధించి జమీర్తోనూ ఆయన పలుమార్లు సంప్రదించినట్టు స్థానిక నాయకులు చెబుతున్నారు. అయితే.. దీనిపై నాన్చుతూ వచ్చిన జమీర్.. ఆయన అనుచరులు.. తాజాగా బీజేపీ గూటికి చేరేందుకు రంగం రెడీ చేసుకున్నారు. బీజేపీ కీలక నాయకులతోనూ వారు చర్చించారని టీడీపీ నేతలు చెబుతున్నారు.అయితే.. ముందు తమతో చర్చించి.. తర్వాత బీజేపీ తీర్థం ఎలా పుచ్చుకుంటారంటూ.. టీడీపీ నాయకు లు వివాదానికి దిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జమీర్తో మాట్లాడేందుకు పరిటాల శ్రీరాం అనుచ రులు కొందరు జమీర్ ఇంటికి వెళ్లారు. అయితే.. వారు వివాదానికే వచ్చారని భావించిన జమీర్ అనుచరు లు ఆకస్మికంగా దాడికి దిగారు. ఉద్దేశ పూర్వకంగానే తమపై దాడికి పాల్పడ్డారని టీడీపీ నాయకులు.. భావించి ఎదురు దాడికి దిగారు. ఇక, ఈ విషయం తెలిసిన వెంటనే బీజేపీ నాయకులు రంగంలోకి దిగారు. తమ పార్టీలోకి చేరాలని భావిస్తున్న జమీర్పై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారంటూ వారు కూడా రోడ్డె క్కి.. టీడీపీ నేతలపై కలియబడ్డారు. దీంతో ధర్మవరంలో సోమవారం ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థి తులు నెలకొన్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు పక్షాలను చెదరగొట్టి.. భారీ భద్రతను కల్పించారు. అయితే.. ఉద్రిక్త పరిస్థితులు మాత్రం కొనసాగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa