ఉత్తర ప్రదేశ్ బాగ్పత్లోని ఆదినాథుడి ఆలయంలో నిర్వాణ లడ్డూ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఎంతో ఘనంగా చేస్తున్న ఈ వేడుకకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వస్తుంటారు. ముఖ్యంగా మధ్య ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ నుంచి వేలాది మంది భక్తులు వచ్చారు. ఈక్రమంలోనే నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వెదురు, కలప చెక్కలతో వేదికను నిర్మించారు. అయితే ఈరోజు ఎక్కువ మంది భక్తులు ఉత్సవం పాల్గొనడం.. దాదాపు 60 మంది వరకు భక్తులు వేదికపైకి ఎక్కారు.
దీంతో బరువు ఆపలేకపోయిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో భక్తులు అంతా కింద పడిపోయారు. ఐదుగురు ప్రజలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా భక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే సహాయ చర్యలు అందించారు. ఒక్కొక్కరినీ బయటకు తీసుకు వస్తూనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు మృతులతో పాటు క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
ముఖ్యంగా వేదిక కింద ఉన్న భక్తులను క్షేమంగా బయటకు తీసుకు వస్తున్నారు. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని.. గాయపడిన వారిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఆధ్యాత్మిక వేడుకలో ఇంత ఘోర ప్రమాదం సంభవించడం తన మనసును కలిచి వేస్తుందని చెప్పుకొచ్చారు. ఈక్రమంలోనే మృతుల పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఆయన.. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa