ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు అమలాపురం, రాజోలు ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకునే విధంగా యాత్రకు రూపకల్పన చేశారు. కొత్తగా వచ్చిన 36 సీట్ల సూపర్ లగ్జరీ వీడియో కోచ్ బస్సుల్లో ఈ యాత్రకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వివరాలను డిపో మేనేజర్లు సీహెచ్ సత్యనారాయణమూర్తి, ధనమ్మ మంగళవారం వివరించారు. ఫిబ్రవరి 12వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు అమలాపురం, రాజోలు ఆర్టీసీ బస్టాండ్ల నుంచి బస్సులు బయలుదేరుతాయి. భువనేశ్వర్, పూరి, కోణార్క్, ప్రయాగరాజ్- కుంభ మేళా, వారణాసి, అయోధ్య, బుద్ధ గయ, అరసవిల్లి, శ్రీకూర్మం, త్రివేణి సంగమ స్నానం, విశ్వనాథ దర్శనం, గయ పిండ ప్రధాన ప్రదేశాలకు తీసుకెళతారు. ప్రయాగరాజ్, కాశీ పుణ్యక్షేత్రాల్లో ఒక రోజు బస చేస్తారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం అందిస్తారు.
యాత్రికులు ప్రయాణంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో బస్సు దిగి తిరిగి చేరుకుంటారు. ఈ క్రమంలో బస్సు ఎక్కడ ఉందో సులువుగా తెలుసుకునేందుకు యాప్ను అందుబాటులోకి తెచ్చారు. దీనిని ప్రతి ప్రయాణికుడి చరవాణిలో ఇన్స్టాల్ చేస్తారు. దాని ఆధారంగా ఎవరి సాయమూ లేకుండా బస్సు వద్దకు చేరుకోవచ్చు.మహా కుంభ మేళాకు వెళ్లేందుకు ఫిబ్రవరి 12న బస్సులు బయలుదేరుతాయి. ముందస్తు రిజర్వేషన్లు చేయించుకోవచ్చు. అమలాపురం, రాజోలు పరిసర ప్రాంతాల ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa