ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 02:06 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections)కు షెడ్యూల్‌ విడుదలైంది. ఏపీ, తెలంగాణలో మూడు చొప్పున స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్‌ విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అదే నెల 27న పోలింగ్‌ నిర్వహించి.. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.ఏపీలో ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్‌ జరగనుంది.తెలంగాణలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. వీటితో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com