కేంద్ర ప్రభుత్వం దేశంలో రైతుల గుర్తింపు కోసం ప్రత్యేక ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకవచ్చింది. 26న గణతంత్ర దినోత్సవం రోజున మన రాష్ట్రంలో ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుల ఆన్లైన్ నమోదు ప్రక్రియను వ్యవసాయ శాఖ అధికారులు ప్రారంభించనున్నారు. దీని ద్వారా ప్రతి రైతుకూ ఒక ప్రత్యేక గుర్తింపు లభించనుంది. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ తరహాలో 14 అంకెలతో కూడిన ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తుంది. ఇది దేశంలో రైతు గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది. ఈ గుర్తింపు కార్డుల ద్వారా రైతులను అప్రమత్తం చేస్తారు. వాతావరణ మార్పులపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తారు. వ్యవసాయ పథకాలను నేరుగా చేరవే స్తారు. పంట నష్టం, ప్రకృతి వైపరీత్యాలు, బీమా పరిహారంలో ఈ గుర్తింపు కార్డు ఎంతో ఉపయోగకరం కానుంది. రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీ తప్పక చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. స్థానిక రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించి, తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు అన్లైన్ అవగాహన ఉన్న రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని, లేదా వెబ్ పోర్టల్లో స్వయంగా కూడా నమోదు చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. రైతులు తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఆధార్ కార్డు, రైతు పొలం 1.బి ఆధార్తో లింక్ ఉన్న మొబైల్ నంబరుతో స్థానిక రైతు సేవా కేంద్రంలో సంప్రదించాలి. అన్లైన్లో నమోదు తర్వాత రైతులకు 14 అంకెలతో కూడిన వ్యక్తిగత గుర్తింపు సంఖ్య ఇస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa