సుమారు వెయ్యి కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల కాలుష్యంతో రెండు లక్షల మత్స్యకార కుటుంబాలు జీవనోపాధి కోల్పోతున్నాయని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన పర్యావరణవేత్త డాక్టర్ రాజేంద్రసింగ్ ఆందోళన వ్యక్తంచేశారు. విశాఖపట్నంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... తీర ప్రాంతంలో ఉన్న పరిశ్రమల వ్యర్థాలు సముద్రంలో కలవడంతో మత్స్య సంపదకు తీవ్రనష్టం కలుగుతోందన్నారు. ఇటీవల ఈ కాలుష్యం కారణంగా సముద్ర తాబేళ్లు (ఆలివ్ రిడ్లీ) పెద్దసంఖ్యలో మృత్యువాత పడ్డాయన్నారు. దీనిపై కాలుష్య నియంత్రణ మండలి, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని మత్స్యకారుల జీవనోపాధిని కాపాడాలని డాక్టర్ రాజేంద్రసింగ్ కోరారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa