కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంపై విమానాలు చక్కర్లు కొడుతున్న ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈరోజు కూడా ఒక విమానం ఆలయ గోపురంపై నుంచి వెళ్లింది. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంపై నుంచి రాకపోకలు సాగిస్తే ఆపదలు సంభవిస్తాయని పండితులు చెపుతున్నారు. తిరుమల ఆలయ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని కేంద్రాన్ని టీటీడీ కోరినా కేంద్ర విమానయాన శాఖ పట్టించుకోలేదని సమాచారం.