ఇన్ఫోసిస్ నారాయణమూర్తి-సుధామూర్తి దంపతుల అల్లుడు, బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్ శనివారం జైపుర్లో జరిగిన లిటరేచర్ ఫెస్టివల్కు హాజరయ్యారు. తన సతీమణి అక్షతామూర్తితో కలిసి రిషి సునాక్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి హాజరైన వారికి రిషి సునాక్ కూర్చొని అభివాదం చేస్తుండగా.. సుధామూర్తి సోదరి సునందా కులకర్ణి.. రిషి సునాక్ను వారించి.. పైకి లేచి అందరికీ నమస్కారం చేయాలని సూచించారు. దీంతో వెంటనే పైకి లేచిన రిషి సునాక్ అందరికీ నమస్కారం చేశారు. ఆ తర్వాత అంతా సరదాగా నవ్వుకున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు వైరల్గా మారింది.