మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ, డిఫెండింగ్ చాంపియన్ గా టోర్నీలో అడుగుపెట్టి రెండోసారి కూడా మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు అభినందనలు తెలియజేస్తున్నానని వెల్లడించారు. సమష్టి ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారని లోకేశ్ కొనియాడారు. టోర్నీ మొత్తం తనదైన బ్యాటింగ్, బౌలింగ్ తో అద్భుత ప్రదర్శన చేసిన తెలుగు క్రికెటర్ గొంగడి త్రిష అందరికీ గర్వకారణంలా నిలిచారని కితాబిచ్చారు. భారత మహిళల జట్టు భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని లోకేశ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.