అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక… ఇండియాకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అయితే… తాజాగా ఇండియాకు మరో షాక్ తగిలింది. భారతీయులను వెనక్కి పంపుతోంది అమెరికా. అమెరికా నుంచి భారత్కు అక్రమవలసదారుల విమానం వచ్చింది. సీ-17 మిలటరీ ఎయిర్క్రాఫ్ట్లో భారతీయులను వెనక్కి పంపుతోంది అమెరికా.మొత్తం 205 మందితో టెక్సాస్ నుంచి బయలుదేరింది విమానం. సుమారు 18 వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్టు గుర్తించారు. డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా వరుసగా అందరినీ వెనక్కి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్రమంగా నివసించేవారి విషయంలో అమెరికాకు సహకరిస్తోదట భారత ప్రభుత్వం. ఈ తరునంలోనే… అమెరికా నుంచి భారత్కు అక్రమవలసదారుల విమానం వచ్చింది.