ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 10 నుంచి డీవార్మింగ్‌ కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 05, 2025, 12:04 PM

రక్తహీనత నివారణపై అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్యశాఖ విజయనగరం జిల్లా ప్రోగ్రాం అధికారి టి.జగన్మోహనరావు అన్నారు. మక్కువ మండలంలోని శంబర పీహెచ్‌సీని ఆయన మంగళవారం పరిశీ లించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఆరోగ్యపరమైన సమస్యలు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ నెల 10 నుంచి నిర్వహించనున్న డీవార్మింగ్‌ కార్యక్రమానికి తగు ప్రణాళికలు సిద్ధం చేసు కోవాలని సూచించారు. ప్రపంచ కేన్సర్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం శంబర జాతరలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మక్కువ, శంబర పీహెచ్‌సీల వైద్యాధికారులు జి.హరికృష్ణ, ఎంవీ కిరణ్‌కుమార్‌, నిఖిల పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com