'నా ప్రియమైన ఢిల్లీ సోదర సోదరీమణులారా' అని సంభోదిస్తూ రాహుల్ గాంధీ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఢిల్లీ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 'మీరందరూ ఈరోజే వెళ్లి ఓటు వేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్కు వేసే ప్రతి ఓటు మీ హక్కులను కాపాడుతుంది. రాజ్యాంగాన్ని బలోపేతం చేసి ఢిల్లీని తిరిగి పురోగతి మార్గంలో నడిపిస్తుంది. ఓటు వేసేటప్పుడు, కలుషితమైన గాలి, మురికి నీరు, చెడిపోయిన రోడ్లకు ఎవరు బాధ్యులో గుర్తుంచుకోండి. స్వచ్ఛమైన రాజకీయాలు చేయడం గురించి మాట్లాడుకుంటూ ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణానికి పాల్పడింది ఎవరు? అనేది గుర్తుంచుకోండి' అని తెలిపారు.