ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెనక్కి తగ్గిన ట్రంప్.... బంగారం ధరలో 'భారీ' మార్పు

business |  Suryaa Desk  | Published : Wed, Feb 05, 2025, 11:58 PM

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అప్పటికప్పుడు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలతో ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇటీవల మెక్సికో, కెనడా నుంచి అమెరికాకు వచ్చే ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధిస్తానని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు చైనా నుంచి వచ్చే దిగుమతులపైనా 10 శాతం దిగుమతి సుంకం ప్రకటించారు. ఈ క్రమంలోనే మళ్లీ అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో.. వాణిజ్య యుద్ధం మళ్లీ వస్తుందన్న భయంతో.. ప్రపంచ స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి. ఇదే క్రమంలో అనిశ్చిత పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడిగా ఉండే, ఆర్థికంగా భరోసా కల్పించే బంగారంపై పెట్టుబడులు మళ్లగా.. రికార్డు స్థాయిలో బంగారం ధరలు పెరిగాయి.


అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అమెరికా, మెక్సికోలపై విధించిన టారిఫ్స్‌పై డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. ప్రస్తుతానికి ఈ సుంకాల విధింపును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే మళ్లీ స్టాక్ మార్కెట్లకు పాజిటివ్ సెంటిమెంట్ తోడైంది. వాణిజ్య యుద్ధ భయం సంకేతాలు కలిగించిన ట్రంప్ నుంచి సానుకూల ప్రకటన రావడంతో ఆసియా సహా మన స్టాక్ మార్కెట్ సూచీలు కూడా పుంజుకుంటున్నాయి. ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు జరుపుతున్నారు.


ఈ వార్త రాసే సమయంలో మధ్యాహ్నం 2 గంటలకు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ఏకంగా 1100 పాయింట్లకుపైగా పెరిగి 78,300 మార్కుపైన ట్రేడవుతోంది. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 320 పాయింట్ల లాభంతో 23 వేల 670 మార్కుపైన కొనసాగుతోంది. పలు హెవీ వెయిట్ స్టాక్స్ కూడా ఈ క్రమంలోనే రాణిస్తూ మార్కెట్లకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. చివరకు 1300 పాయింట్లకుపైగా లాభంతో ముగిసింది.


ఇలా మార్కెట్లు లాభాల్లో ఉన్న క్రమంలోనే బంగారం ధరలు కూడా మరోవైపు దిగొస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో కిందటి సెషన్లో ఏకంగా 2830 డాలర్ల వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకగా.. ఇప్పుడు వార్త రాసే సమయంలో అది 2810 డాలర్ల దిగువకు చేరింది. స్పాట్ సిల్వర్ రేటు 31.60 డాలర్ల వద్ద ఉండేది. దీనికి ముందు మాత్రం.. సుంకాల విధింపు నేపథ్యంలో స్పాట్ గోల్డ్ రేటు 2780 డాలర్ల నుంచి గరిష్టాలకు చేరగా.. ట్రంప్ వెనక్కి తగ్గిన నేపథ్యంలోనే మళ్లీ బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఇలా ఒక్కరోజు వ్యవధిలోనే భారీగా పెరగడం.. మళ్లీ వెనక్కి తగ్గడం జరగడం గమనార్హం. ఇక రూపాయి విలువ కూడా కాస్త పుంజుకుంది. ప్రస్తుతం రూ. 87.07 వద్ద ఉంది. ఇక దేశీయంగా గోల్డ్ రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా ఫిబ్రవరి 4న 22 క్యారెట్స్ గోల్డ్ రేటు హైదరాబాద్ మార్కెట్లో రూ. 1050 పెరిగి తులం రూ. 78,100 కు చేరింది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 85,200 కు చేరడం ఆందోళన కలిగిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com