భారత యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఓ అరుదైన ఘనత సాధించాడు. నిన్న ఇంగ్లాండ్తో మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ప్రదర్శించిన శ్రేయస్ అయ్యర్ 36 బంతుల్లో 163.89 స్ట్రైక్ రేట్తో 59 పరుగులు చేశాడు. ఈ క్రమంలో వన్డే క్రికెట్లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్కు దిగి 50 కన్నా ఎక్కువ సగటు, 100 కన్నా ఎక్కువ స్ట్రైక్ రేట్తో 1,000కి పైగా పరుగులు చేసిన తొలి ప్లేయర్గా (ప్రపంచ క్రికెట్లో) నిలిచాడు.