కాల్మనీ రాక్షసులు మళ్లీ రెచ్చిపోతున్నారు. వారు చేస్తున్న అరాచకాలతో ప్రజలు భయాభ్రాంతులకు గురవుతున్నారు. తీసుకున్న అప్పుకు లక్షలకు లక్షలు వడ్డీలు కట్టినా వేధిస్తోండటంతో బాధితులు న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలోని కావలిలో మనీస్కాం వెలుగు చూసింది. ఈ స్కాంలో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహబూబ్ సుభానీ ఆగడాలు మీతిమిరిపోయాయి ఇప్పుడు ఈ కేసు ఏపీలో సంచలనంగా మారింది. కావలిలో మనీస్కాం ప్రధాన నిందితుడు మహబూబ్ సుభానీ రూ.వందల కోట్ల కుంభకోణాలను మీడియా వెలుగులోకి వచ్చింది.
![]() |
![]() |