ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కారైక్కాల్‌ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 12, 2025, 05:27 PM

తమిళనాడు, కరూర్‌ జిల్లా తిరుకాంబులియూర్‌ ప్రాంతాల్లో రైలు పట్టాలపై ఏర్పడిన పగుళ్లను సకాలంలో గుర్తించడంతో ఎర్నాకుళం-కారైక్కాల్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. తిరుకాంబులియూర్‌ మార్గంలో మంగళవారం ఉదయం రైల్వే రిటైర్డ్‌ ఉద్యోగి కలియమూర్తి వెళ్తున్న సమయంలో, రైలు పట్టాలపై పగుళ్లను గుర్తించాడు. కలియమూర్తి ఈ విషయాన్ని వెంటనే గ్యాంగ్‌మెన్‌లకు తెలియజేశాడు. అదే సమయంలో వస్తున్న ఎర్నాకుళం-కారైక్కాల్‌ ఎక్స్‌ప్రె్‌సకు గ్యాంగ్‌మెన్‌లు ఎర్రజెండా చూపించి నిలిపివేశారు.పగుళ్లు ఏర్పడిన వంద మీటర్ల దూరంలోనే రైలు నిలవడంతో పెను ప్రమాదం తప్పింది. అలాగే, వాస్కోడిగామా-వేలాంకన్ని ఎక్స్‌ప్రెస్‌ మాయనూరు రైల్వేస్టేషన్‌లో, కరూర్‌-తిరుచ్చి అన్‌ రిజర్వ్‌డ్‌ రైలు వీరాక్కియం రైల్వేస్టేషన్‌లలో నిలిపివేశారు. పగుళ్లు ఏర్పడిన ప్రాంతాన్ని కార్మికులు సరిచేయడంతో 45 నిమిషాలు ఆలస్యంగా ఎర్నాకుళం-కారైక్కాల్‌ ఎక్స్‌ప్రెస్‌ బయల్దేరి వెళ్లింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com