ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒంగోలు గిత్త భారీ ధర పలికింది. బ్రెజిల్లో ఇటీవల మేలు జాతి పశువుల వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో ఒంగోలు జాతి గిత్త ఏకంగా రూ. 41కోట్ల ధర పలికింది. ఈ క్రమంలో ఒంగోలు జాతి గిత్తలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వాఖ్యలు చేశారు. ప్రపంచ వేదికపై ఒంగోలు గిత్త రూ.41 కోట్లు పలికి తన సత్తా చాటిందన్నారు. రాష్ట్ర పశుసంవర్ధక వారసత్వం ప్రపంచానికి చాటిందని పేర్కొన్నారు. ఒంగోలు గిత్తలు ఉన్నత జన్యువులు, బలానికి ప్రసిద్ధి చెందాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతిని పరిరక్షిస్తూ పాడి రైతులను ఆదుకోవడానికి కృషి చేస్తోందని వెల్లడించారు.
![]() |
![]() |