ప్రతీ ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రమాదాల సమయంలో తమ ప్రాణాలు కాపాడుకోవాలని పొదలకూరు సీఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్ఐ హనీఫ్ లు అన్నారు. జాతీయ రహదారి మాసోత్సవాలలో భాగంగా పొదలకూరు సర్కిల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులకు, మహిళలకు హెల్మెట్ లను పంపిణి చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద నుండి రామ్ నగర్ గేట్ సెంటర్, సంగంరోడ్డు కూడలి వరకు హెల్మెట్ ధరించి సీఐ, ఎస్ఐ, పాత్రికేయులు, యువకులతో కలసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హెల్మెట్ ధరించి ప్రయాణాలు చేయడం ద్వారా ప్రమాదాల సమయంలో ఖచ్చితంగా ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు. హెల్మెట్ లేకపోవడం వల్లే ప్రమాదాల సమయంలో ప్రాణాలు పోతున్నాయని పేర్కొన్నారు. జనవరి 10 నుండి ఫిబ్రవరి 15 వరకు జరిగే జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు హెల్మెట్ లను పంపిణి చేశామని తెలిపారు. యువకులు ముఖ్యంగా అతివేగంగా మోటార్ బైకులు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారని ఆ సమయంలో హెల్మెట్ ధరిస్తే గాయలతో బయటపడే అవకాశాలు ఉన్నాయని ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది రసూల్, షరీఫ్, రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa