ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 21కి వాయిదా పడిన శ్రీరెడ్డి కేసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2025, 08:39 AM

2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గరనుండి వైసీపీ మరియు ప్రతిపక్ష పార్టీల నేతలపై, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినీనటి శ్రీరెడ్డి పై కూడా కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ సినీనటి విమల మల్లిడి అలియాస్‌ శ్రీరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com