ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. మరికొన్ని రోజుల్లో మహా కుంభమేళా ముగియనున్న నేపథ్యంలో రోజురోజుకూ భక్తుల తాకిడి పెరుగుతోంది. ఈ క్రమంలోనే మహా కుంభమేళా నిర్వహణ కోసం.. ఉత్తర్ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం.. అనేక చర్యలు చేపడుతోంది. అయితే మహా కుంభమేళా సందర్భంగా మహా కుంభ్నగర్లో తరచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుండటం.. తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటివరకు 2 సార్లు మహా కుంభమేళాలో ఫైర్ యాక్సిడెంట్లు జరిగాయి. తాజాగా శనివారం మరోసారి మహా కుంభమేళాలో అగ్ని ప్రమాదం జరిగింది.
మహా కుంభ్నగర్లోని లవకుష్ ధామ్ శిబిరంలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని.. ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం ఏమీ జరగలేదని వెల్లడించారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా అక్కడ ఏర్పాటు చేసిన మండపాలు, టెంట్లు కాలిబూడిదయ్యాయి. కాగా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కాలేదు.
మహా కుంభమేళాలో ఇప్పటికే రెండుసార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఫిబ్రవరి 9వ తేదీన సెక్టార్-23లో గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా ఫైర్ యాక్సిడెంట్ సంభవించింది. వెంటనే ఫైరింజన్లను తరలించి మంటలను అదుపు చేశాయి. అంతకుముందు జనవరి 30వ తేదీన తొలిసారి అగ్నిప్రమాదం జరిగింది. ఛత్నాగ్ ఘాట్ వద్ద టెంట్ సిటీలో మంటలు చెలరేగి.. దాదాపు 10 టెంట్లు దగ్ధం అయ్యాయి. మొత్తం మీద.. మహా కుంభమేళా ప్రారంభం నుంచి అనేక అగ్నిప్రమాదాలు సంభవించాయి. జనవరి 19వ తేదీన గోరఖ్పూర్లోని గీతా ప్రెస్ క్యాంప్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో 150కి పైగా కుటుంబాలు ప్రభావితం అయ్యాయి. ఆ అగ్నిప్రమాదానికి గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణమని తెలుస్తోంది. అయితే గీతా ప్రెస్ వ్యక్తులు మాత్రం అగ్నిప్రమాదం బయటి వారి వల్ల జరిగిందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa