విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బ్యారక్కు అధికారులు పరదాలు కట్టినట్టు తెలిసింది. భద్రతా చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో న్యాయస్థానం రిమాండ్ విధించగా, జైలు అధికారులు ఆయనకు ఒకటో నంబరు బ్యారక్లో గదిని కేటాయించారు. అందులో ఉన్న వంశీ ఇతర ఖైదీలకు కనిపించకుండా కటకటాల వద్ద పరదా కట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇతర ఖైదీలెవరూ వంశీ ఉన్న బ్యారక్ వైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. బ్యారక్ వద్ద ఉన్న సీసీ కెమెరాల ద్వారా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం విజయవాడలోని జిల్లా కారాగారానికి రానున్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని ఆయన పరామర్శిస్తారని తెలిసింది. ప్రస్తుతం జగన్ బెంగళూరులో ఉన్నారు. ఆయన మంగళవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా గాంధీనగర్లోని జైలుకు వెళ్తారని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa