ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజాసేవ చెయ్యడానికే రాజకీయాల్లోకి వచ్చాను

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 12:30 PM

రాజకీయాల కతీతంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందజేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. ఎంపీపీ, జడ్పీటీసీ సొంత గ్రామమైన మోపాడులో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. పామూరు మండలంలోని మోపాడు ఇరిగేషన్‌ బం గ్లా వద్ద ఆదివారం జరిగిన కార్యక్రమంలో వైసీపీకి చెందిన ముస్లిం, ఎస్సీ, బీసీ, వివిద సామాజిక వర్గాల 50 కుటుం బాలకు చెందిన 94 మంది ఎమ్మెల్యే ఉగ్ర సమక్షంలో టీడీపీ లో చేరారు. వారందరికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈసందర్భంగా డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ ప్రజలకు సేవకుడిగా ఉండేందుకే తాను రాజకీయాల్లో వచ్చానని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. తన హయాంలో మోపాడు ప్రాజెక్టు ఆధునికీకరణ కింద జైకో నిధులతో అభివృద్ధి పనులు శరవేగంగా సాగు తున్నాయన్నారు. వెలిగొండ ప్రాజెక్టును మోపాడు రిజర్వా యర్‌కు అనుసంధానం చేయడం తమ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా రాజకీయ వివక్షత చూపనని స్పష్టం చేశారు. మన పిల్లల భవిష్యత్తు కోసం అందరూ ఏకం కా వాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు టీడీపీ బలోపేతం కోసం అందరిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు చెప్పా రు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థు లను గెలిపించుకొంటే మనకు భవిషత్తు ఉంటుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa