ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులకు విద్యతోపాటు అన్ని రంగాల్లో అవగాహన అవసరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 17, 2025, 12:32 PM

ఒంగోలు పీవీఆర్‌ మునిసిపల్‌ బాలుర ఉన్నత పాఠశాలలో, పాఠశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన ప్రకాశం బాలోత్సవం కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా సుమారు 5 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. కొందరు నృత్యంలో అద్భుత అభినయాన్ని ప్రదర్శించారు.. మరికొందరు చిత్రలేఖనంలో తమ చాతుర్యాన్ని చాటుకున్నారు.. ఇంకొందరు మట్టితో వ్యవసాయ పరికరాలను తయారుచేసి ఔరా అనిపించారు.. అంతేగాక ఫ్యాన్సీ డ్రస్సులతో వయ్యారంగా నడుస్తూ చూపరులను కట్టిపడేశారు.. వక్తృత్వ పోటీలలో తమ భాషా కౌశల్యాన్ని చాటి చెప్పారు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో అంశంలో సృజనాత్మకతకు కాదేదీ అనర్హం అని ఆ చిన్నారులు నిరూపించారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్‌ బాలోత్సవాన్ని తిలకించి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోపాటు పలు రంగాల్లో విజ్ఞానం అవసరం అన్నారు. ఆ విజ్ఞానాన్ని వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పారు. ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే చెడు అలవాట్లకు ముఖ్యంగా మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగ్రత్త వహించాలన్నారు. డీఈవో కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ విద్యాశాఖకు వన్నెతెచ్చే విధంగా బాలోత్సవం కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయమని చెప్పారు. నగర మేయర్‌ గంగాడ సుజాత మాట్లాడుతూ బాలోత్సవం విద్యా ప్రగతికి విద్యార్థులలోని ప్రతిభాపాటవాలను వెలికితీసేందుకు ఉపయోగపడుతుందన్నారు. డాక్టర్‌ సతీష్‌ మాట్లాడుతూ సమాజ ప్రగతికి విద్యార్థులే పునాదులని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa