AP: జీబీఎస్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో సోమవారం జీబీఎస్ వ్యాధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏపీలో పెరుగుతున్న జీబీఎస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణాలపై అధికారులతో సీఎం చర్చించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.
![]() |
![]() |